ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా గురుంచి చిత్ర నిర్మాత ఏ. ఎం. ర‌త్నం తాజాగా అభిమానులకు బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా చెప్పిన‌ట్టు మార్చి 28నే థియేట‌ర్ల‌లోకి తీసుకువ‌స్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ దిశ‌గా ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని వెల్లడించారు. ఎవరూ ఎటువంటి ఆందోళ‌న చెందనవసరం లేదు, అనుకున్న స‌మ‌యానికి సినిమాను విడుద‌ల చేస్తాం. "ప‌వ‌న్ కళ్యాణ్ కు సంబంధించి మిగిలిన షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నాం" అని అన్నారు. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా చిత్రం యూనిట్ కీల‌క అప్‌డేట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే, ఈ సినిమా సెకండ్‌ సింగిల్ 'కొల్లగొట్టిందిరో' అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ ను ఫిబ్రవరి 24న‌ మధ్యాహ్నం 3 గంటలకు విడుద‌ల చేయనున్నట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. దీంతో ఈ పాట కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు చిత్ర నిర్మాత సినిమా విడుదల విషయంలో రాజీపడేది లేదని, ముందు చెప్పిన విధంగానే మర్చి 28వ తారీఖునే సినిమాను తీసుకువస్తామని చెప్పి అభిమానులను ఖుషీ చేశారు.